భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన మే 3న ప్రారంభమవగా, మే 6 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా మే 4, బుధవారం నాడు అస్సాంలోని తముల్పూర్లో జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. అనంతరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర నార్త్ ఈస్ట్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ గౌహతిలో నిర్వహించనున్న నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వైభవోత్సవ కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఇక మే 5, గురువారం నాడు ఐజ్వాల్లోని మిజోరాం విశ్వవిద్యాలయం యొక్క 16వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొని, ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ