ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అల్లూరిని చేర్చడం తెలుగు జాతికి గర్వ కారణమన్న ఆయన ఇందుకోసం తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 125వ జయంతి వేడుకలు సందర్భంగా సత్వరమే పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలని చంద్రబాబు లేఖలో కోరారు. గతంలోనే పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత కేంద్రంలో మరియు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ఏర్పాటులో ఆలస్యం అయిందని తెలిపారు. కావున జాప్యం లేకుండా విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, స్వాతంత్య్ర సమర యోధులను గౌరవించుకోవడం మన బాధ్యతని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ