ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం జగన్ పలు సూచనలు చేశారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించడంతో పాటు మొత్తంగా దీని కింద 3,118 చికిత్సా విధానాలు వచ్చాయని ఆయన ప్రకటించారు. గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లుప్ చెప్పిన సీఎం జగన్ ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వ్యవహరిస్తారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY