ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా మరో నాయకుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను. హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీలో జనవరి 5 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. వీరిలో 8,73,427 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 3038 మంది చికిత్స పొందుతున్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 6, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ