మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. నగరంలోని బోయినపల్లిలో మంగళవారం నాడు చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటనకు సంబంధించి అఖిలప్రియను బోయినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా మంగళవారం రాత్రి బోయినపల్లిలోని జాతీయ మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు ఇంట్లోకి ఐటీ అధికారులమని చెప్పి కొందరు దుండగులు ప్రవేశించారు. ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ లను వారు కిడ్నాప్ చేశారు. ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు ఆ ముగ్గురిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. వికారాబాద్లో వారిని గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు.
అనంతరం కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ భూమి విషయంలో కొంతకాలంగా ప్రవీణ్ రావు కుటుంబానికి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబానికి వివాదం నడుస్తున్నట్టు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా వీరి అరెస్టులు చోటుచేసుకున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ