సీఎం జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు

TDP, CM jagan,Nara Lokesh, The red book is for YCP leaders,CM Jagan is not Arjuna,chandrababu,MLA Amarnath, Gannavaram,Red Book,YCP Leaders,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
TDP, CM jagan,Nara Lokesh, The red book is for YCP leaders,CM Jagan is not Arjuna

సీఎం జగన్ అర్జునుడు కాదని.. ఆయనొక భస్మాసురుడని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్‌లో శంఖారావం సభలో మాట్లాడిన ఆయన ..చంద్రబాబు హయాంలో విశాఖ పట్నంను జాబ్ క్యాపిటల్‌గా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఎద్దేవా చేశారు. భూ దందాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మార్వోను  వైసీపీ నేతలు చంపేయడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

జగన్ సీఎం అయ్యాక సింహాచలం దర్శనానికి  రావడం లేదెందుకుని ఓ మహిళ తనను అడిగిందని లోకేష్ గుర్తుచేశారు. దానికి సమాధానంగా.. జగన్‌కు ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికీ వెళ్తారని అన్నారు. ప్రజలు డబ్బులు లూటీ చేసి పేపర్, టీవీలు పెట్టారని…అవి మన డబ్బులేనని చెప్పారు. హైదరాబాద్‌లో జగన్‌కు  ఒక ఇల్లు, విశాఖలో, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని…టీడీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ లాక్కుంటామని అన్నారు.

విశాఖ రాజధాని అని ఎప్పుడు జగన్ చెప్పారో అప్పటి నుంచీ  విధ్వంసాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. మద్యపానం నిషేధం చేశాకే  ఓట్లు అడగటానికి వెళ్తానని జగన్ అన్నారని..మరిప్పుడు  ఎన్నికలకు ఎందుకు సిద్ధం అయ్యారని ప్రశ్నించారు. గన్నవరం పోర్ట్, కృష్ణ పట్నం పోర్ట్‌లను జగన్ లాగేశారని.. ఇదే పరిస్థితి గంగవరం పోర్ట్‌కు కూడా రాబోతుందని లోకేష్ జోస్యం చెప్పారు. జగన్ ఇసుక పైన రోజుకు రూ. 3 కోట్లు  సంపాదిస్తున్నారని మండిపడ్డారు.

గూగుల్‌లో 6093 అని కొడితే ఖైదీగా ఉన్న జగన్ ఫోటో వస్తుందని లోకేష్ కౌంటర్ వేశారు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్  మాస్టర్ అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కరెంట్ చార్జీలు పెంచి,  చెత్త పన్ను పెంచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని  విమర్శించారు. రానున్న రోజుల్లో గాలి పైన కూడా జగన్ పన్ను వేస్తారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అన్న లోకేష్..టీడీపీ అధికారంలోకి వచ్చాక  అవసరం అయితే విశాఖ ఉక్కును తామే నడిపిస్తామని స్పష్టం చేశారు.

జగన్ తో పాటు మంత్రి అమర్నాథ్ పైన కూడా లోకేష్ కౌంటర్లు వేశారు. కోడి గుడ్డు మంత్రి..ఆమ్లెట్లు వేసుకునే పనిలో ఉన్నారని.. ఈ కోడి గుడ్డు మంత్రిని చూసి ఏపీలో ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని సెటైర్ వేశారు. వైసీపీ నేతల కోసమే తాను ఇప్పుడు రెడ్ బుక్కును తయారుచేశానని లోకేష్ చెప్పారు. ఈ రెడ్ బుక్కుపై వైసీపీ ప్రభుత్వం నాన్ బెయిల్‌బుల్ వారెంటీ కేసు పెడతామని అంటుందని.. వారికి దమ్ము ఉంటే రావాలని సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వం  తనపైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు.. 22 కేసులు పెట్టిందని లోకేష్ మండిపడ్డారు.అయినా సరే తాను తగ్గలేదని ..అలాగే చంద్రబాబును  అరెస్ట్ చేసినప్పుడు తనకు పవన్ అన్న అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు పవన్ ను  కూడా వైసీపీ నేతలంతా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఈ వైసీపీ పేటియం బ్యాచ్‌కు వేరే ఏం పని లేదని లోకేష్ విరుచుకుపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =