భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లోనే దేశంలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం విశేషం. మే 7, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 52,952 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,783 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 15,267 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 35,902 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గతవారం రోజులనుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 16,758 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 1000 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3094 మంది కోలుకోగా, 651 మంది మరణించారు. పాజిటివ్ కేసులతో పాటుగా కరోనా మరణాలు సైతం మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 6,625, ఢిల్లీలో 5,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 16,758
- గుజరాత్ – 6,625
- ఢిల్లీ – 5,532
- తమిళనాడు – 4,829
- రాజస్థాన్ – 3,355
- మధ్యప్రదేశ్ – 3,138
- ఉత్తర ప్రదేశ్ – 2,998
- ఆంధ్రప్రదేశ్ – 1,777
- పంజాబ్ – 1,526
- పశ్చిమబెంగాల్ – 1,456
- తెలంగాణ – 1,107
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu