జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ, చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13, ఆదివారం నాడు జరిగిన 85వ ఎపిసోడ్ లో నటుడు మహేష్ విట్టా ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో వరుణ్ సందేశ్, రాహుల్, మహేష్ విట్టా ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లోనే ముందుగా రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన మహేష్ విట్టా- వరుణ్ సందేశ్ లలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందిన మహేష్ విట్టాను ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించారు.
మహేష్ విట్టాను ఇంటి సభ్యులందరూ సరదాగా, నవ్వుతూ బయటకి పంపించారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చే సమయంలో బాబా భాస్కర్ కాళ్లకు మహేష్ నమస్కారం చేసారు. స్టేజ్ మీదకు వచ్చిన మహేష్ ను, ఇంటిలో ఉన్న ఏడుగురులో నంబర్ వన్ కంటెస్టెంట్ బొమ్మను బోర్డుపై అతికించమని చెప్పగా, బాబా భాస్కర్ ఫోటోను బోర్డుపై అతికించాడు. అలాగే ఇంటి సభ్యులపై బిగ్ బాంబ్ వేయాలంటూ నాగార్జున కోరగా, మహేష్ శ్రీముఖిని ఎంచుకున్నాడు. బిగ్ బాంబ్ శిక్ష కింద కిచెన్ లో ఉన్న సామాగ్రి అంతటిని శ్రీముఖి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీంలుగా మార్చి సినిమా పేరు కనిపెట్టేలా బోర్డు పై బొమ్మలు వేయించారు. ఈ ఆటలో శ్రీముఖి టీం విజయం సాధించింది. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో ఇప్పటికి 85 రోజులు పూర్తయ్యాయి. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, శిల్ఫా చక్రవర్తి, హిమజ , రవికృష్ణ, పునర్నవి. మహేష్ విట్టా ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిలో ఇంకా 7 గురు సభ్యులున్నారు.