తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై కీలక సూచనలు చేసారు. మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిచితీరాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపధ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టిఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ జారీచేసింది. వివిధ విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే వారికి చెల్లించే వేతనాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే కొందరిని నియమించుకోగా, ఇంకా అదనంగా డ్రైవర్లు, కండక్టర్లను తీసుకోవడానికి ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డ్రైవర్లకు రూ.1500, కండక్టర్లుకు రూ.1000 చొప్పున రోజువారీ వేతనం చెల్లించబోతున్నారు. రవాణా, పోలీసు శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మెకానిక్స్, శ్రామిక్స్లతో పాటు ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్ విభాగాల్లో కూడ తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నారు. అదే విధంగా ఏసీ బస్సులు నడిపే డ్రైవర్స్, పర్యవేక్షించే మెకానిక్ లకు రోజువారీగా రూ.2000 చొప్పున వేతనం చెల్లించనున్నారు.
[subscribe]