పాన్-ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల కోసం టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘సాహో’ తర్వాత వస్తున్న చిత్రం కావడం.. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా ‘రాధేశ్యామ్’ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్లో వేగం పెంచిన చిత్రయూనిట్ రోజుకో పాటను విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. దీనిలో భాగంగానే, రేపు (23, గురువారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ను అట్టహాసంగా నిర్వహించడానికి రామోజీ ఫిలిమ్ సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్యారిస్ నేపథ్యంలో సాగే రాధేశ్యామ్ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్కు జోడిగా బెంగళూరు భామ పూజా హేగ్డే నటిస్తోంది. హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్కు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ఈ చిత్రానికి పనిచేయడంతో రాధే శ్యామ్పై మరింత ఆసక్తి పెరిగింది. టి-సిరీస్ కంపెనీ నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్‘ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా, గురువారం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలు భాషలకు చెందిన అభిమానుల చేతుల మీదుగా సినిమా ట్రైలర్ను విడుదల చేయించనున్నారని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ