దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. కొత్తగా 1,334 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్ 24, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,46,44,076 కు, మరణాల సంఖ్య 5,28,977 కి పెరిగిందని తెలిపారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 87,905 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 90 (90,00,85,711) కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 1.52 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.95 శాతంగా ఉంది.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 1,557 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,91,906 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతం గానూ, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 23,193 (0.05%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY