దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ చేశారు. జనవరి 24, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,82,201 మంది హెల్త్కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కేవలం గత 24 గంటల్లో మొత్తం 3,512 కేంద్రాల్లో 1,91,609 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 27,920 సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. అత్యధికంగా కర్ణాటకలో(1,88,971), ఒడిశాలో (1,52,371), ఆంధ్రప్రదేశ్ లో (1,47,030), ఉత్తరప్రదేశ్ లో (1,23,761), తెలంగాణలో (1,10,031) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ