ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2 కోట్లు దాటింది. జూలై 26, సోమవారం మధ్యాహ్నం 3 గంటల నాటికీ లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,03,08,010 కు చేరుకున్నట్టు తెలిపారు. ఇందులో 1,54,33,831 మంది మొదటి డోసు వ్యాక్సిన్, 48,74,179 మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు ఏపీ వైద్యశాఖ సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మెగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. 45 సంవత్సరాలు పైబడినవారికి, విదేశాలకు వెళ్తున్న వారికీ, స్కూల్స్/కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి, గర్భిణీలకు, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు సమీప ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ