దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు మూడు వేలకు దిగొచ్చింది. గత 24 గంటల్లో కొత్తగా 3,011 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్ 3, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,45,97,498 కు, మరణాల సంఖ్య 5,28,701 కి పెరిగిందని తెలిపారు.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 4,301 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,32,671 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 36,126 (0.08%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 1,34,849 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 89.57 (89,57,48,895) కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 2.23 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.31 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY