భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. రోజుకు 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,62,414 కు, మరణాల సంఖ్య 76,271 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 96,551 కరోనా పాజిటివ్ కేసులు, 1209 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35 లక్షలు దాటింది. ఒకే రోజులో 70,880 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 35,42,663 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 77.6 శాతంగా నమోదైంది. ఇక దేశంలో ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్ లలో 9,43,480 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu