తెలంగాణ శాసనసభ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రోజే ఉదయమే రెవెన్యూ బిల్లుపై సభలో చర్చ మొదలయింది. టిఆర్ఎస్ సభ్యులు ఈ బిల్లు వలన రైతులకు కలిగే లాభాలు, రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో చోటు చేసుకునే మార్పులను వివరించారు. ఇక కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుపై మాట్లాడుతూ సలహాలు, సూచనలు చేయడంతో పాటుగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలతో పాటుగా, బిల్లులోని కీలక అంశాలపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ బిల్లుకు చెందిన భూమిపై హక్కులు, పాస్పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు శాసన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అలాగే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu