భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ మరియు అమెరికన్ విమానాల తయారీ సంస్థ బోయింగ్తో బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక ఈ మెగా డీల్లో సుమారు 70 వరకు పెద్ద విమానాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎయిర్బస్ నుంచి 250 విమానాలు మరియు బోయింగ్ నుంచి 220 విమానాల కోసం ఆర్డర్లు చేసింది. వీటి విలువ 85 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.6.5 లక్షల కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం. కాగా ఎయిర్ ఇండియా నిర్ణయంతో ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరగనుంది.
Ready to take off with 20 Boeing 787s and 10 Boeing 777-9s widebody aircraft, and 190 Boeing 737 MAX single-aisle aircraft. The B777/787s will be powered by GE Aerospace and B737 Max by CFM International#ReadyForMore @BoeingAirplanes @GE_Aerospace @GEIndia @CFM_engines
— Air India (@airindiain) February 14, 2023
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందంపై స్పందించారు. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుండి 200 విమానాలను కొనుగోలు చేయాలన్న ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. దీనిని టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్స్ మరియు బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం అని బైడెన్ పేర్కొన్నారు. ఎయిరిండియా మరియు బోయింగ్ మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ద్వారా 200కు పైగా అమెరికన్ నిర్మిత విమానాలను కొనుగోలు చేసినట్లు ఈరోజు ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఈ కొనుగోలు 44 రాష్ట్రాలలో ఒక మిలియన్ అమెరికన్ ఉద్యోగాలను కల్పించనుంది’ అని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో జో బైడెన్ తెలిపారు. ఇక ఎయిర్బస్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎయిర్ ఇండియా 40 వైడ్ బాడీ ఎ350 విమానాలు మరియు 210 నారో బాడీ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ నారో బాడీ విమానంలో 140 ఎ320 విమానాలు మరియు 70 ఎ321నియో విమానాలు ఉన్నాయి. కాగా వైడ్-బాడీ ఎయిర్క్రాఫ్ట్ అల్ట్రా-లాంగ్ విమానాల కోసం ఉపయోగించబడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE