కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నాయకులు పి.చిదంబరం, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్ ఉన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సందర్భంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే అగ్నిపథ్ పథకంపై దేశంలో వెల్లువెత్తిన నిరసనలను వివరించి, ఆ పథకాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY