తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు. తాజా నిర్ణయం వలన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,558 మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ప్రయోజనం పొందనున్నారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు తర్వాత బదిలీల కోరుతూ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్ధనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో పాటు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు, ఒక మల్టీ జోన్ నుంచి మరో జోన్కు పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY