ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనావైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం టోక్యో ఒలింపిక్స్ – 2020 పై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఒలింపిక్స్ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) ప్రకటించింది. మార్చ్ 24, మంగళవారం నాడు కరోనా ప్రభావంతో టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. జపాన్ ప్రధాని షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్ను ఒక ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ఐఓసీ తెలిపింది. సభ్య దేశాల సూచనలు, అభ్యర్థనలు మేరకు ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేయగా, ఐఓసీ అధ్యక్షుడు బాచ్ అంగీకరించారని అని షింజో మీడియాకు తెలియజేశారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలో రద్దు /వాయిదా పడటం ఇది మూడోసారి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రెండు సార్లు ఒలింపిక్స్ రద్దవగా, ఈసారి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడ్డాయి.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -