భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 8 వేల లోపే నమోదవడం కొంచెం ఊరట కలిగిస్తోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు సోమవారం నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మరింత తక్కువ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) మొత్తం 2,11,029 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,633 కొత్త కోవిడ్-19 పాజిటివ్లు వెలుగుచూశాయి. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61వేల మార్కును దాటింది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 4,48,34,859కి చేరినట్లయింది. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 18, ఉదయం 8 గంటల వరకు):
- గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,11,029
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 17–ఏప్రిల్ 18 (8AM-8AM)] : 7,633
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,48,34,859
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 6,702
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,42,474
- కరోనా రికవరీ రేటు : 98.68 శాతం
- యాక్టివ్ కేసులు : 61,233
- కొత్తగా నమోదైన మరణాలు : 11
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,152
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,27,271) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE