దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,831 పాజిటివ్ కేసులు, 84 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,38,194 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,080 కి పెరిగింది. ప్రస్తుతం 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో 5000 కన్నా తక్కువ యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
ఇక హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా 1,48,609 (1.37%) మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా 11,904 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,05,34,505 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.20 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.43 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 8, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 20,19,00,614
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,08,38,194
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 7–ఫిబ్రవరి 8 (8AM-8AM)] : 11,831
- నమోదైన మరణాలు : 84
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,05,34,505
- యాక్టీవ్ కేసులు : 1,48,609
- మొత్తం మరణాల సంఖ్య : 1,55,080
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ