దేశంలో ఇటీవల రోజువారీ కరోనా కేసుల నమోదులో కొంత పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 379 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,89,072కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (120), కేరళ (78), మహారాష్ట్ర (54), తమిళనాడు (32), తెలంగాణ (25) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. ఇక కరోనా వలన మరో మరణం ( మహారాష్ట్రలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,776కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 3177 (0.01%) కి చేరుకుంది. అలాగే మరో 277 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,55,119 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 9, గురువారం ఉదయం 8 గంటల వరకు 220.64 కోట్లకుపైగా (220,64,34,000) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE