దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 15,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 19, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,37,83,062 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 25 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,25,785 కి పెరిగింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,43,654 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.47 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,43,654 (0.33%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 16,113 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,31,13,623 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక జూలై 18, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 87.01 కోట్లకు (87,01,55,452) చేరుకుంది. జూలై 18న 4,68,350 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY