దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇటీవల 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,645 కేసులు నమోదు కావడంతో జనవరి 10, ఆదివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,04,50,284 కు చేరుకుంది. కరోనాతో మరో 201 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,50,999 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే కోటి మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకేరోజులో 19,299 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,00,75,950 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.42 శాతం గానూ, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,23,335 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ