ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,196 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 758 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి 25, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,95,897 కు చేరుకుంది. ఇక కరోనా వలన చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7201 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 231 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,85,209 కు చేరింది. అలాగే ప్రస్తుతం 3469 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,48,75,597 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(758):
- తూర్పుగోదావరి – 45
- కర్నూల్ – 27
- కృష్ణా – 80
- కడప – 24
- గుంటూరు – 127
- చిత్తూరు – 175
- అనంతపూర్ – 56
- నెల్లూరు – 33
- ప్రకాశం – 30
- శ్రీకాకుళం – 27
- విశాఖపట్నం – 98
- విజయనగరం – 23
- పశ్చిమగోదావరి – 13
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ