తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 394 కేసులు నమోదవడంతో మార్చి 20, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,118 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ముగ్గురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1669 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 194 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 2,98,645 కు చేరుకుంది. ప్రస్తుతం 2,804 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాడు 64,898 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 96,13,583 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 2,58,290 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ