ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ళ తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నామని, రైతులందరికీ ఎలాంటి వివాదాలు లేని భూమి అందిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సెక్షన్-22 ఏ (1) కేటగిరీ కిందకు వచ్చే నిషేధిత భూముల జాబితా నుండి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.
సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
- నేటి నుంచి అవనిగడ్డలో 10వేల పైచిలుకు ఉన్న రైతులకు సంబంధించి 15వేలకు పైగా ఉన్న భూములకు సర్వహక్కులు కల్పిస్తున్నాం.
- ఇకపై వారు కానీ, వారి పిల్లలు కానీ, మనుమలు కానీ ఈ భూములపై హక్కు ఉంటుంది. ఈరోజునుంచి ఈ భూములకు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
- దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నేటికీ భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడం బాధాకరం.
- రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందుగా దీనిపై దృష్టి పెట్టాం.
- భూముల రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేపట్టాం.
- అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, 15వేల మంది సిబ్బందితో దీనిని నిర్వహిస్తున్నాం.
- ఈ సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నాం.
- నవంబర్ నెల నుంచి ఏకంగా 1500 వందల గ్రామాల్లో మొదలు పెడుతున్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 15వేల గ్రామాల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం.
- చుక్కల భూములు, అనాధీన భూముల విషయంలో ఉన్న అన్ని వివాదాలు పరిష్కరిస్తాం.
- త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
- అలాగే త్వరలోనే ఏపీలోని రైతులందరికీ వివాదాలు లేని భూముల హక్కు పత్రాలు అప్పగిస్తాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY