దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. వరుసగా నాలుగో రోజూ కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,03,738 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 4092 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,42,362 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 37,36,648 (16.76%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా మహారాష్ట్ర (56,578), కర్ణాటక (47,563), కేరళ (41,971), తమిళనాడు (27,397), ఉత్తర్ ప్రదేశ్ (26,636), ఆంధ్రప్రదేశ్ (20,065), వెస్ట్ బెంగాల్ (19,436), రాజస్థాన్ (17,987), ఢిల్లీ (17,364), హర్యానా (14,667) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 4,03,738 కేసులలో 71.75 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 82.15 శాతం, మరణాల రేటు 1.09 శాతం:
దేశంలో మరో 3,86,444 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,83,17,404 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 82.15 శాతం గానూ, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లక్షదీప్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ