దేశంలో కరోనా నుంచి కోలుకుని ఒకేరోజు 44306 మంది డిశ్చార్జ్

Covid-19 in India, Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus Higlights, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus Live Updates, Coronavirus news highlights, Coronavirus outbreak, coronavirus positive cases, Coronavirus Positive Cases In India, india coronavirus cases, india coronavirus deaths,Total Corona Cases In India

భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆగస్టు 4, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు, 803 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 38,938 కు చేరింది. దేశంలో మరణాల రేటు 2.10 శాతంగా ఉంది.

గత 24 గంటల్లోనే 44306 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 12,30,509 కు పెరిగింది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 66.31 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో మొత్తం 5,86,298 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా, ఎక్కువ కరోనా‌ మరణాలు నమోదైన దేశాల్లో ఇటలీని దాటి భారత్ 5 వ స్థానానికి చేరింది. మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, బ్రిటన్, మెక్సికో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 12 =