దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,80,603 కు చేరుకుంది. కరోనాతో మరో 87 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,55,447 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1.35 లక్షలకు (1,35,926) తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 1.25% మాత్రమే యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కరోనా కేసులు నివేదించబడలేదు.
కరోనా రికవరీ రేటు 97.32 శాతం, మరణాల రేటు 1.43 శాతం:
ఇక కొత్తగా 15,858 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,05,89,230 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.32 శాతం గానూ, మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 9,309 కేసులలో 79.87 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ