కేరళ రాష్ట్రంలో కొత్తగా 12223 కరోనా పాజిటివ్ కేసులు, 25 మరణాలు నమోదు

Covid-19 in Kerala : 12223 New Positive Cases and 25 Deaths Reported in Last 24 Hours

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 77,598 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 12,223 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 15.75 శాతంగా నమోదైంది. దీంతో ఫిబ్రవరి 16, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 64,40,371కి చేరింది. ఇక కొత్తగా 21,906 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 62,62,770 కు చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 25 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 118 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 195 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 63,019 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 1,13,798 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,53,76,788 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − three =