మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 5, బుధవారం కూడా 57640 కరోనా కేసులు, 920 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,80,542 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 72,662 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 57,006 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 41,64,098 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.32 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,41,596 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా పుణేలో 8,89,624, ముంబయిలో 6,65,057, థానేలో 5,27,623, నాగ్పూర్లో 4,47,534, నాశిక్ లో 3,32,021 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 2,83,84,582 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ