దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నిన్నటితో (జనవరి 16) 1 సంవత్సరం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తల పాత్రను ప్రధాని ప్రశంసించారు. కోవిడ్-19పై పోరాటానికి భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం గొప్ప బలాన్ని చేకూర్చిందని ప్రధాని మోదీ అన్నారు.
కాగా దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 158 కోట్లకుపైగా (1,58,12,73,035) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 13 కోట్లకు పైగా (13,79,62,181) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరోవైపు దేశంలో జనవరి 17, సోమవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 157.20 కోట్లు (1,57,20,41,825) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 39,46,348 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ