దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్తవిధానంలో భాగంగా దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ డోసుల్లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం సమీకరించించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 2.01 కోట్లకుపైగా (2,01,96,572) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని విధానాల ద్వారా మొత్తం 36.97 కోట్లకు పైగా (36,97,70,980) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూలై 5, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 34,95,74,408 డోసులను వినియోగించినట్టు కేంద్రం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ