తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో “మహా పాదయాత్ర” చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి అక్టోబర్ 2న హుజురాబాద్ లో ముగించనున్నట్టు ఆదివారం నాడు జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ వెల్లడించారు. బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 55 రోజుల పాటు 750 కీ.మీ మేర సాగనున్నట్టు తెలుస్తుంది. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులును బండి సంజయ్ కోరారు. మరోవైపు పాదయాత్రపై బీజేపీ పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేస్తునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ