దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 183.62 కోట్లకుపైగా (1,83,62,27,980) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 17 కోట్లకుపైగా (17,02,22,816) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
34 లక్షల మందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్:
మరోవైపు దేశంలో మార్చి 22, మంగళవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 181.56 కోట్లు (1,81,56,01,944) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి మార్చి 16, 2022న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకు 34 లక్షల మందికిపైగా (34,19,633) మొదటి డోస్ వ్యాక్సిన్ అందించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ