టీ20 వరల్డ్కప్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టీమిండియా బౌలింగ్ దళానికి నేతృత్వం వహించే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమవడంతో జట్టు ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉండగా తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. హరారేలో జింబాబ్వేతో జరిగిన సిరీస్లో దీపక్ చాహర్ సుదీర్ఘ గాయం నుండి తిరిగి వచ్చాక దక్షిణాఫ్రికాతో సిరీస్ లో మంచి ప్రదర్శన చేశాడు. అయితే దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో వెన్ను గాయం కారణంగా దీపక్ చాహర్ టోర్నమెంట్ నుండి తప్పుకోవడం తెలిసిందే.
కాగా అక్టోబర్ 16నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ప్రస్తుతం పెర్త్లో వార్మప్ గేమ్లు ఆడుతున్న టీమ్ ఇండియాతో కలవనున్నారు. సీనియర్ పేసర్ షమీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా బుమ్రా స్థానంలో ఆడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. ఇక శార్దూల్ ఠాకూర్ కూడా ఫామ్లో ఉండటంతో టీమిండియా మేనేజ్మెంట్ వీరిని పరీక్షించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY