కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. తాజాగా లాక్డౌన్ అమలుకు సంబంధించి మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రం కొత్తగా ప్రకటించిన సడలింపుల వివరాలు:
- అటవీ ఉత్పత్తులు, కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చి కార్యకలాపాలకు అనుమతి.
- కొబ్బరి కాయలు, వెదురు, కోకో, సుగంధ ద్రవ్యాల సాగు, శుద్ధి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ కు అనుమతి.
- నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, హాసింగ్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యకలాపాలకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, నీటి సరఫరా, విద్యుత్, టెలిఫోన్, పారిశుద్ధ్యం, ఆప్టికల్ ఫైబర్ లైన్ల పనులకు అనుమతి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu