ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్కు చేరుకున్న ఆయన ఆప్ ఎన్నికల ప్రచారం కోసం సోమ, మంగళవారాల్లో వివిధ బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. బీజేపీ పాలిత గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఈసారి అక్కడ ఆప్ పార్టీని బీజేపీకి పోటీగా బరిలో నిలిపేందుకు సీఎం కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానిక ఆప్ నాయకులు మరియు కార్యకర్తలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే సామాన్యుల నుంచి ఉద్యోగాలు, వ్యాపారులు, న్యాయవాదులు సహా ఇతర ఉన్నత వర్గాలను కూడా కలుస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ కేజ్రీవాల్ను తన ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించగా, దీనికి అంగీకరించిన సీఎం మీటింగ్ అయ్యాక రాత్రి 8 గంటలకు అతని ఆటోలోనే వస్తానని మాట ఇచ్చారు. దీంతో అతని ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాగా గతంలో కూడా సీఎం కేజ్రీవాల్ పంజాబ్లో ఓ ఆటో డ్రైవర్ కోరిక మేరకు అతని ఇంటికి వెళ్లి భోజనం చేయడం విశేషం. గుజరాత్ ప్రజలకు ఆయన ఒక హామీ ఇచ్చారు. తదుపరి ఎన్నికల్లో ఆప్ ను గెలిపిస్తే గుజరాత్ ప్రజలకు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక సీఎం కేజ్రీవాల్ మంగళవారం పారిశుధ్య కార్మికులతో మరో టౌన్ హాల్ మీట్ నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY