ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి అయిన ఎలన్ మస్క్, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలును ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచినట్లు ప్రకటించడం సంచలనమైంది. ట్విట్టర్ను కొనుగోలు డీల్ను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు ఆయన ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్పామ్ మరియు నకిలీ ఖాతాల పూర్తి వివరాలు ఇంకా తమకు అందజేయలేదని, దానిపై క్లారిటీ వచ్చాకే ఈ డీల్పై తమ తదుపరి చర్య ఉంటుందని ఆయన ప్రకటించారు.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
స్పామ్/నకిలీ ఖాతాలు వాస్తవానికి 5 శాతం కంటే తక్కువ వినియోగదారులను సూచిస్తాయనే గణనకు మద్దతు ఇచ్చే డీల్ పెండింగ్లో ఉంచబడిందని మస్క్ తన ట్వీట్ లో తెలిపారు. దీంతో ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కంపెనీ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 17.7% క్షీణించి $37.10కి పడిపోయాయి. కాగా స్పామ్ ఖాతాలు 5% కంటే తక్కువగా ఉండొచ్చని ట్విట్టర్ అంచనా వేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ