కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 14 వ రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చర్చల జరిపిన సందర్భంగా చట్టాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కొత్త చట్టాల్లో పలు సవరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు రైతులకు రాతపూర్వక ప్రతిపాదనలు పంపింది. కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదనలలో పేర్కొంది. అయితే చట్టాల రద్దు ప్రతిపాదనల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, సవరణలను అంగీకరించబోమని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదనలపై మరోసారి చర్చించి సాయంత్రానికి తమ నిర్ణయాన్ని కేంద్రానికి వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ