దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796 కు చేరుకుంది. కరోనాతో మరో 199 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,60,166 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 3,45,377 (2.96%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (24645), పంజాబ్ (2299), గుజరాత్ (1640), ఛత్తీస్ ఘడ్ (1525), కర్ణాటక (1445), తమిళనాడు (1385) వంటి రాష్ట్రాల్లో 1,000 కి పైగా కొత్త కేసులను నమోదయ్యాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 95.67 శాతం, మరణాల రేటు 1.37 శాతం:
దేశంలో మరో 29,785 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,11,81,253 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.67 శాతం గానూ, మరణాల రేటు 1.37 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 40,715 కేసులలో 80.90 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. అలాగే గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్, గోవా, ఉత్తరాఖండ్, ఒడిశా, లక్షద్వీప్, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ