ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని తీసుకొస్తునట్లు ప్రకటించారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతమని పేర్కొన్నారు. కాగా ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
ప్రధాని మోదీ ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ గురించి వివరిస్తూ, రోజువారీ కూలీలు మరియు తక్కువ ఆదాయం గల కుటుంబాలు, స్థానిక తయారీ యూనిట్లు, స్థానిక మార్కెట్లు మరియు సరఫరా వ్యవస్థతో సహా అందరికి ఈ ప్యాకేజీతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. మరోవైపు కేంద్రం పెద్ద మొత్తంలో ప్యాకేజి ప్రకటించడాన్ని దేశంలో పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ఆర్ధిక ప్యాకేజీ యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ రోజు 4 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో అటు పారిశ్రామిక వర్గాలలోనూ, ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉంది.
Finance Minister Smt. @nsitharaman will address a Press Conference today, 13th May 2020, at 4 PM in New Delhi.#EconomicPackage#AatmanirbharBharat #AatmaNirbharBharatAbhiyan #IndiaFightsCorona pic.twitter.com/FmKcItA23C
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu