ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతూనే ఉంది. మే 13, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,284 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కొత్తగా గుంటూరులో 12, చిత్తూరులో 11, కర్నూల్ లో 7, తూర్పు గోదావరి జిల్లాలో 4, కృష్ణా, అనంతపూర్ జిల్లాల్లో 3 కేసులు, ఇతరులకు 8 మందితో కలిపి మొత్తం 48 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన 3, తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన 4 పాజిటివ్ కేసులు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 47 మంది మృతి చెందగా, మరో 1142 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 948 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 12, మంగళవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1326 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 37 మందికి, వలస వచ్చిన వారికీ 14 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా, 822 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 472 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates:రాష్ట్రంలో గత 24 గంటల్లో
*9,284 సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*86 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు#APFightsCorona pic.twitter.com/muzg1AZbJL— ArogyaAndhra (@ArogyaAndhra) May 13, 2020
Media bulletin
Date: May 12, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/mJUtlPAZFs
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 12, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu