మహరాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ కోవిడ్-19 ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 13 మంది కరోనా బాధితులు మరణించారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇతర రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో 13 మంది కరోనా పేషంట్స్ మరణించడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అధికారులను సీఎం ఉద్ధవ్ థాకరే ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. అలాగే ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 రూపాయలను పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి అందజేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ