దేశంలో మరోసారి 10 వేలకుపైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 19,893 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 4, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 53 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,26,530 కి పెరిగింది. ముఖ్యంగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,36,478 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.50 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,36,478 (0.33%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 20,419 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,34,24,029 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.50 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక ఆగస్టు 3, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 87.67 కోట్లకు (87,67,60,536) చేరుకుంది. ఆగస్టు 3న 4,03,006 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY