ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమ్రపాలి కూడా ఉన్నారు. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె అక్టోబర్ 27, 2023 వరకు కొనసాగనున్నారు. ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ సబ్ కలెక్టర్గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ జిల్లా కలెక్టర్గా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పీఎంవోలో తాజాగా డైరెక్టర్గా రఘురాజ్ రాజేంద్రన్ మరియు అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్ నియమితులయ్యారు. వీరి నియామకాలపై అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ సెప్టెంబర్ 12, శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu