టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు ఇంకా బోణి కొట్టలేదు. ఈ టోర్నీలో సూపర్-12 లో భాగంగా గ్రూపు-2 లో ఉన్న భారత్ జట్టు ఇప్పటికే మొదటి రెండు మ్యాచుల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయాన్ని ఎదుర్కొవడంతో సెమీఫైనల్ కు చేరే అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది.
ఇక ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లతో జరిగే మ్యాచుల్లో నైనా భారీ విజయాలను నమోదు చేయాలని భారత్ భావిస్తుంది. అయితే ఈ మ్యాచుల్లో గెలుపొందినా కూడా భారత్ సెమీస్ చేరాలంటే ఇతర జట్ల మధ్య సంచలన ఫలితాలు నమోదవడంపై ఆధారపడి ఉంది. ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లోనైనా భారత్ ఆటగాళ్లు ఫామ్ అందుకుని, టోర్నీలో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత్ ప్రోబబుల్ జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆఫ్ఘానిస్తాన్ ప్రోబబుల్ జట్టు: మహ్మద్ నబీ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, హష్మతుల్లా షాహిదీ/ఉస్మాన్ ఘనీ, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నయీబ్, రషీద్ నైబ్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ