టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సూపర్-12 లో భాగంగా గ్రూపు-2 లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే తమ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సెమీస్ పోరులో నిలవాలంటే ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తర్వాత జరిగే మ్యాచ్ లలో ఇరుజట్లు ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా వంటి జట్లతో ఆడనుండడంతో కీలకమైన ఈ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ కు చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకోవాలని భావిస్తున్నాయి.
దీంతో ఈ రెండు జట్లు మధ్య ఆదివారం హోరాహోరీ పోరు ఉంటుందని క్రీడాభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఆదివారం పాకిస్తాన్ తో ఓడిపోయిన టీమిండియా బృందం ఈ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో ప్రత్యర్థి న్యూజిలాండ్ తో ఎప్పుడూ తీవ్ర పోరు ఎదురవుతున్న నేపథ్యంలో, తాజాగా మరింతగా నెలకున్న అంచనాలకు అనుగుణంగా సత్తాచాటాలని టీమిండియా భావిస్తుంది. టీ20 ప్రపంచ కప్ లో ఈ మ్యాచ్ ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో మరోకొద్దీ గంటల్లో తేలనుంది.
భారత్ ప్రోబబుల్ జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ ప్రోబబుల్ జట్టు: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ/ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ